www.ntodaynews.com
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. టైరు పంచరై బోల్తాపడ్డ తుఫాన్ వాహనం.. ముగ్గురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కర్నూలు జిల్లాకు తిరుగు ప్రయాణం అవుతున్న భక్తులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న పుల్లంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.