తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, తిరువూరు)
తిరువూరు: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరువూరు ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ ఏ. కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 80 మందిని గుర్తించి ఆర్డీఓ ఏ. కుమార్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. తమ సేవలను గుర్తించి పురస్కారాలు అందించడం పట్ల అవార్డు గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.