BREAKING
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా
www.ntodaynews.com

తిరువూరులో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:48 PM
4 వీక్షణలు

తిరువూరు, ఆగస్టు 29: తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి వేడుకలను శనివారం తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలోకి తీసుకురావడంలో చేసిన అపారమైన సేవలను స్మరించుకున్నారు.

తెలుగు భాష అభివృద్ధికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు. భాషను ప్రజల జీవితాలతో మమేకం చేసిన గొప్ప సంస్కర్తగా ఆయన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.