తిరువూరులో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి వేడుకలు ఘనంగా
తిరువూరు, ఆగస్టు 29: తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి వేడుకలను శనివారం తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలోకి తీసుకురావడంలో చేసిన అపారమైన సేవలను స్మరించుకున్నారు.
తెలుగు భాష అభివృద్ధికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని అధికారులు పేర్కొన్నారు. భాషను ప్రజల జీవితాలతో మమేకం చేసిన గొప్ప సంస్కర్తగా ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.