తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆగస్టు 4: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అవగాహన పోస్టర్లు, గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన మొదటి గంటలోపే తల్లిపాలను ప్రారంభించడం అత్యంత కీలకమని తెలిపారు. పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాల ద్వారా శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు.
తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆరోగ్య శాఖ సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిరక్షణలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.