BREAKING
Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం Cm నాగార్జునసాగర్ పర్యటనలో డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ 4 లేబర్ కోడ్లపై కార్మికుల తిరుగుబాటు సంతోష్‌నగర్‌లో రాస్తారోకో.. కార్మికుల అరెస్ట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ దేశవ్యాప్తంగా జైల్‌ భరో, రాస్తారోకో, రైల్‌రోకో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
www.ntodaynews.com

తునికిపాడులో ముసుగు దొంగల బీభత్సం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 06:32 PM
7 వీక్షణలు

తునికిపాడులో ముసుగు దొంగల బీభత్సం

  • ఒకే రాత్రి రెండు ఇళ్లు.. అంకమ్మ ఆలయంలో చోరీ

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ముసుగు దొంగలు హల్‌చల్‌ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒకే రాత్రిలో రెండు ఇళ్లు, ఓ ఆలయంలో వరుస చోరీలకు పాల్పడి భారీగా బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

తునికిపాడుకు చెందిన రమావతు కృష్ణకుమారి ఇంట్లోకి చొరబడిన దుండగులు 20 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రూ.45 వేల నగదును దొంగిలించినట్లు సమాచారం. అనంతరం నందిగామలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గద్దల పుల్లారావు ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్న దొంగలు 40 గ్రాముల బంగారం, 6 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదును అపహరించారు.

అదే రాత్రి గ్రామంలోని అంకమ్మ తల్లి ఆలయాన్ని కూడా దొంగలు వదల్లేదు. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి అందులోని సుమారు రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇలా ఒకే రాత్రి మూడు ప్రాంతాల్లో వరుస చోరీలు జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దృశ్యాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. రాత్రి వేళ గ్రామంలో సంచరిస్తూ ఇళ్లను, ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగుల కదలికలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన ఇళ్లు, ఆలయంలో ఆధారాలు సేకరించడంతో పాటు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా ముసుగు దొంగలను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరుస చోరీలతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.