www.ntodaynews.com
ముఖ్యమంత్రికి మేడారం జాతర ఆహ్వానం
తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేడారం జాతర ఆహ్వానం
NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందింది.
ఆహ్వానం అందజేత: అసెంబ్లీ ఛాంబర్లో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మేడారం ఆలయ పూజారులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు.
మేడారం పూజారులు శాస్త్రోక్తంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసి, జాతరలో పాల్గొనాలని కోరారు.ఈ సందర్భంగా మేడారం మహాజాతర విశిష్టతను చాటిచెప్పే గోడపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుక కోసం ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube
మేడారం పూజారులు శాస్త్రోక్తంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసి, జాతరలో పాల్గొనాలని కోరారు.ఈ సందర్భంగా మేడారం మహాజాతర విశిష్టతను చాటిచెప్పే గోడపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుక కోసం ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube