BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మహిళ పరిస్థితి విషమం

తెలంగాణ
28 Dec, 2025 - 09:13 PM
361 వీక్షణలు

బీజేపీ నేత కొడుకుపై ఆరోపణలు చేసిన మహిళ పరిస్థితి విషమం

NTODAY NEWS: మధ్యప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన బీజేపీ నేత కొడుకు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడు నెలలుగా నిరంతర అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొంటూ మానసిక వేదనకు గురైన ఆమె నిద్రమాత్రలు, ఎలుకల మందు తీసుకున్నట్లు సమాచారం. శివపురి మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాయత్రి శర్మ కొడుకు రజత్ శర్మపై 2025 ఏప్రిల్ 30న ఫిర్యాదు చేసిన బాధిత మహిళ ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విషం తీసుకునే ముందు బాధితురాలు ఆరు పేజీల మరణవాంగ్మూలం రాసింది. అందులో గత ఏడు నెలలుగా మానసిక హింస, రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తన మరణానికి గాయత్రి శర్మ, ఆమె భర్త సంజయ్ శర్మ కారణమని బాధితురాలు లేఖలో స్పష్టం చేసింది. రజత్ శర్మతో తన సంబంధం విషయం వారికి ముందే తెలుసని, పెళ్లి విషయమై మొదట అభ్యంతరం లేదని గాయత్రి శర్మ చెప్పినట్లు పేర్కొంది. అయితే 2025 ఏప్రిల్ 14న రజత్ శర్మకు వేరే చోట నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ఆరోపించింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన రోజే నిశ్చితార్థం జరగగా, ఐదు గంటల పాటు ఎదురు చూసినా ఫిర్యాదు నమోదు చేయలేదని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని రాజకీయ ఒత్తిడి తెచ్చారని బాధితురాలు తెలిపింది. కేసు బయటకు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, పదవీ విరమణ చేసిన అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని, రూ.50 లక్షల ప్రలోభం కూడా చూపినట్లు ఆమె మరణవాంగ్మూలంలో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు ఆమె విన్నవించుకుంది.  బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద ఏప్రిల్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోర్ తెలిపారు. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉందని, బాధితురాలి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. Follow us on Website Facebook Instagram YouTube