BREAKING
తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
www.ntodaynews.com

కృష్ణార్జునుల్లా పరుగులు పెట్టిస్తున్నారు

తెలంగాణ
17 Nov, 2025 - 06:43 PM
283 వీక్షణలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు : ప్రత్తిపాటి NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా .. • మంత్రి లోకేశ్ సుపరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు • కాపు, బలిజ, తూర్పుకాపు, వర్గీయుల ఆత్మీయ సమావేశం, వనభోజనాల కార్యక్రమంలో మాజీమంత్రి ప్రత్తిపాటి. విశిష్టమైన, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అందరూ ఒకచోట చేరి ఆత్మీయంగా, కలిసి మెలిసి ఉండటమనేది వనభోజనాల్లోనే సాధ్యమవుతుందని, కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలన రాష్ట్ర భవిష్యత్ కు గట్టి పునాది వేసిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని పురుషోత్తమపట్నంలో ఏర్పాటు చేసిన కాపు, బలిజ, తూర్పుకాపు వర్గీయుల ఆత్మీయ సమావేశం.. వనభోజనాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రత్తిపాటి.. తొలుత ప్రాంగణంలో ప్రతిష్టించిన శివలింగానికి పూజలు నిర్వహించి, దీపారాధన చేసిన అనంతరం కాపు సోదరుల్ని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు. కల్మషం లేని స్వచ్ఛమైన మనసున్న కాపు సోదరులు అంతా ఈ పర్వదినాన ఒకచోట చేరి సంతోషంగా వనభోజనాల్లో పాల్గొనడం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోందని ప్రత్తిపాటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్ర ప్రగతిరథాన్ని పరుగులు పెట్టిస్తుంటే, మంత్రి లోకేశ్ వినూత్న ఆలోచనలతో కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడన్నా రు. వారి ముగ్గురి ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడూ రాష్ట్ర ప్రగతి, ప్రజల యోగ క్షేమాలు, సంతోషమే లక్ష్యంగా ఉంటాయన్నారు. విశాఖ సీఐఐ సమ్మిట్ విజయవంతం రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగాను అభివృద్ధి చేస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. వనభోజనాల కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, షేక్ జమాల్ భాషా, షేక్ అబ్దుల్ కుమీర్, బత్తినేని శ్రీనివాసరావు, అచ్చుకోల భాస్కర్ రావు, దేవిశెట్టి అయ్యప్ప, తోట బ్రహ్మస్వాములు, తోట సత్యం, తోట శ్రీనివాసరావు, తెల్లప్రోలు రామ్మూర్తి, బైరా శ్రీనివాసరావు, నాగబాబు, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube