ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి నివాళులు
యర్నగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన వైసీపీ శ్రేణులు
దేవరపల్లి | Ntoday News
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ అధ్యక్షుడు బళ్ల సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ నరహరిశెట్టి రాజేంద్ర బాబు, మాజీ సర్పంచ్ బొంతా భరత్ బాబు, నరహరిశెట్టి సుధాకర్, నరహరిశెట్టి దొరబాబు, బళ్ల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు బొంతా చినబాబు, గంగవరపు రత్నావళి, మామిడిపల్లి సుధీర్ కుమార్, జువ్వల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.