www.ntodaynews.com
విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ప్రభుత్వం మాదే: మంత్రి గొట్టిపాటి
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
AP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వచ్చే మూడేళ్లు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు. ‘గత వైసీపీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లకుపైగా ట్రూఅప్ ఛార్జీలు విధించింది. దేశంలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ప్రభుత్వం మాదే. ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.800 కోట్లు రాయితీ ఇచ్చాం. వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.