www.ntodaynews.com
విజయవాడ జీజీహెచ్లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ జీజీహెచ్లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు
విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు 15 పడకలతో ప్రత్యేక ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. కొవిడ్ నిర్ధారణ కిట్లు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
కొవిడ్ చికిత్స కోసం 10 మంది వైద్యులతో పాటు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు జీజీహెచ్ నుంచి 46 శాంపిళ్లను ప్రయోగశాలకు పంపగా, వాటిలో ఒక్కరికీ కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాలేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు.