www.ntodaynews.com
విస్సన్నపేటలో ప్రత్యేక నమోదు దినోత్సవం పరిశీలించిన తహశీల్దార్ లక్ష్మీ కళ్యాణి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు దినోత్సవం కార్యక్రమాన్ని మండల తహశీల్దార్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కె. లక్ష్మీ కళ్యాణి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మండలంలోని 185, 186, 187, 189, 191, 192, 193, 194 పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల నమోదు ప్రక్రియ, దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ విధానాలను పరిశీలించారు.
బూత్ లెవెల్ అధికారులు, సిబ్బందితో మాట్లాడిన తహశీల్దార్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని, ఏ ఒక్క అర్హుడైన పౌరుడు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.