విస్సన్నపేటలో వైఎస్ఆర్ వర్ధంతి.. పేదలకు దుప్పట్లు, చీరల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట: బి.జె.ఆర్. నగర్లో లాగు రాహేల్ ఫిలిప్ గృహ ప్రాంగణంలో జననేత వైఎస్ఆర్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. సుమారు 200 మంది పేదలకు దుప్పట్లు, చీరలు అందజేశారు.
కార్యక్రమానికి తొలుత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్, మహానేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్ది రెడ్డి సూర్యనారాయణ రెడ్డి, నరేడ్ల వీరారెడ్డి, మండల వైసీపీ అధ్యక్షులు ఓలేటి దుర్గారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎన్వీ కుటుంబరావు, జిల్లా నాయకులు శిరసాని ప్రకాష్, పల్లెపాం లక్ష్మయ్య, మేకల రవి, పిల్లి రాజేష్, డాక్టర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ యువ నేతలు ప్రదీప్ కుమార్, ప్రవీణ్ కుమార్, కోట శ్రీనుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.