BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

2029లో జమిలి ఎన్నికలు? కేంద్రం ఆలోచనలివే!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 01:18 PM
10 వీక్షణలు

దేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే "ఒకే దేశం - ఒకే ఎన్నిక" (జమిలి ఎన్నికలు) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తరచూ ఎన్నికలు జరగడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

సమాచారం ప్రకారం, 2028 జులైలోపు సంబంధిత బిల్లు చట్టరూపం దాల్చితే 2029 లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది. అయితే జమిలి ఎన్నికలను ఒకేసారి పూర్తిగా అమలు చేయకుండా, 2029 నుంచి 2034 వరకు విడతల వారీగా అమలు చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రణాళిక ప్రకారం 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఐదారు నెలలు పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కొంత మేర తగ్గించే అవకాశమూ ఉంది.

అలాగే 2030, 2031లో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని ఒకటి లేదా రెండేళ్లు తగ్గించి, వాటిని 2034 లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే 2034 నుంచి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.