వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ అయోధ్య రెడ్డికి వినతి పత్రం
NTODAY NEWS: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో శుక్రవారం రోజున వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొండం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ జేఏసీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిండ్ల ధనుంజయ్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 81,85 ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్రంలో 20,000 వేల మంది వీఆర్ఏలు ఉండగా ఈ జీవో ద్వారా 16,577 మంది ఇతర స్థానాలకు వెళ్లిపోయారని అన్నారు మిగతా 3793 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా గత ప్రభుత్వం కాలయాపన చేయడం జరిగిందని అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరామని తెలిపారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube