ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది
భక్తి
ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది
తిరుమల శ్రీవారిని ఆగస్టులో 24,56,017 మంది భక్తులు దర్శించుకున్నారు. అత్యధికంగా 16వ తేదీ 97,014 మందికి వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కలిగింది. గత నెల మొత్తం రూ.137.44 కోట్లు హుండీ ఆదాయం రాగా, 18న అత్యధికంగా రూ.6.12 కోట్లు నమోదైంది. 1.30 కోట్ల లడ్డూలు విక్రయించారు. 19-28 తేదీల మధ్య రద్దీ తీవ్రంగా ఉండగా, దర్శనానికి గరిష్ఠంగా 24 గంటల వరకు సమయం పట్టిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.