చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు స్వయంగా అందించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నగర పంచాయతీ ఎరుకలపేట గాజుల వారి వీధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు.
కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేద కుటుంబాల వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.