BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

ఆర్టీజీఎస్ సీసీటీవీ360డిగ్రీల సహకారంతో తప్పిపోయిన తుమ్మగూడెం గ్రామానికి చెందిన మహిళను గుర్తించిన చాట్రాయి పోలీసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 05:53 AM
138 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ 16-06-2026 తేదీన కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు అందింది. సమాచారం అందిన వెంటనే చాట్రాయి ఎస్ఐ డి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.

దర్యాప్తును వేగవంతం చేయడానికి మహిళ ఫోటోను అదే రోజు రాత్రి 11.00 గంటలకు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 డిగ్రీల ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీటీవీ నెట్‌వర్క్ ద్వారా విశ్లేషణ జరిపి సంబంధిత సమాచారాన్ని సేకరించింది.

తదుపరి రోజు ఉదయం ఏలూరు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి మహిళ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం అందింది. వెంటనే స్పందించిన చాట్రాయి పోలీసులు ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని మహిళను సురక్షితంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

తరువాత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆమె ఇంటి నుండి వెళ్లిపోవడానికి గల కారణాలను తెలుసుకుని అవసరమైన సూచనలు అందించారు. అనంతరం ఆమె క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్ ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా తక్కువ సమయంలోనే మహిళను గుర్తించడం సాధ్యమైంది.

ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కుటుంబ సభ్యులు లేదా బంధువులు కనిపించకుండా పోయిన సందర్భంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఫోటో మరియు వివరాలు అందిస్తే త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.