పోలవరం–చింతూరు ఏజెన్సీలో విషాదం.. వరద ప్రవాహంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోలవరం, ఏలూరు జిల్లా: పోలవరం–చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందంలో ఓ యువకుడు వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
గల్లంతైన వ్యక్తిని విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నీలేష్గా గుర్తించారు. సరదాగా విహారయాత్రకు వచ్చిన స్నేహితుల బృందంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
స్నేహితులు చూస్తుండగానే నీలేష్ వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో వారు వెంటనే అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది గల్లంతైన నీలేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.