BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

ఆస్తి కోసం అక్కను కడతేర్చిన తమ్ముడు

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
18 May, 2026 - 04:57 PM
152 వీక్షణలు

NTODAY NEWS సూర్యాపేట :- కుటుంబ ఆస్తి తగాదాలు చివరకు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆత్మకూరు (ఎస్) మండలం పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

గ్రామానికి చెందిన సురుగు అంజమ్మ అనే మహిళను ఆమె సొంత తమ్ముడు ఆస్తి వివాదాల కారణంగా దారుణంగా హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబానికి సంబంధించిన భూమి, ఆస్తుల విషయంలో కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో తలెత్తిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన తమ్ముడు అంజమ్మపై దాడి చేసినట్లు తెలిసింది.

దాడిలో తీవ్రంగా గాయపడిన అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన తెలిసిన వెంటనే గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత అక్కను కూడా కడతేర్చే స్థాయికి దిగజారడం దారుణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.