అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
రూ. 129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్
ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డు లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను ఆయన ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు