BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​వైభవంగా వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు... ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దంపతులు

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 08:36 PM
66 వీక్షణలు

​వైభవంగా వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు... ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దంపతులు

  • ​రెడ్డి కాలనీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం
  • ​ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మేయర్ దర్ని మధుకర్
  • మేయర్ దంపతులను సత్కరించిన నిర్వాహకులు, పురోహితులు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డి కాలనీలో శ్రీ వాసుకి పరమేశ్వరి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాఢ మాస శ్రీ వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ - సుజాత దంపతులు వారాహి అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు.

​అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు సమస్త ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో వర్థిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు, వేద పండితులు మేయర్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.

​ఈ పూజా కార్యక్రమంలో మేయర్‌తో పాటు నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలువేరు శ్రీనివాస్, ఆలయ పురోహితులు వేణుగోపాల చారి, భారీ సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.