www.ntodaynews.com
జనార్ధనవరం గ్రామంలో మన డబ్బులు–మన లెక్కలు కార్యక్రమంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
జనార్ధనవరం గ్రామంలో మన డబ్బులు–మన లెక్కలు కార్యక్రమంపై అవగాహన
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో చైతన్య గ్రామైక్య సంఘ సభ్యులు నిర్వహించిన "మన డబ్బులు–మన లెక్కలు" అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య పాల్గొని మాట్లాడారు. సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభ్యులు చెల్లించిన పొదుపు, రుణాలు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. దీంతో లెక్కల్లో పారదర్శకత పెరిగి, సభ్యులకు తమ ఖాతాలపై పూర్తి అవగాహన కలుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చైతన్య గ్రామైక్య సంఘ సభ్యులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.