వైభవంగా వెలిమినేడు గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగ
చిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లోడే చిరంజీవి గౌడ్, నోముల రాము, దేశబోయిన మంజుల మల్లేష్, మహంకాళి లింగస్వామి, జనగాం మంగమ్మ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోలి నరేష్, బద్దం మల్లేష్ పాల్గొన్నారు.
అలాగే వెలిమినేడు గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.