BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 20 September 2026, 06:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు రచయితలకు అక్షర కిరీటి బిరుదులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Sep, 2026 - 06:02 PM
18 వీక్షణలు

తిరువూరు: భద్రాద్రి కవితా పండుగ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 176వ జాతీయ ద్విశతాధిక కవి సమ్మేళనంలో తిరువూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు రచయితలు ‘అక్షర కిరీటి’ బిరుదులతో ఘనంగా సన్మానించబడ్డారు.

భద్రాచలం సమీపంలోని ఎటపాకలోని డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. కత్తి మండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక అధికార ప్రతినిధి వరలక్ష్మి సాయిరాం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఐఏఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, శ్రీశ్రీ కళావేదిక ప్రణాళిక అధ్యక్షులు డాక్టర్ పార్థసారథి, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంచాక్షరయ్య తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేసిన తిరువూరుకు చెందిన రచయిత్రి ఈడే వెంకట భరత్ కుమారి, ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరుకు చెందిన విశ్వనాథుని శంకరాచారి ప్రతిభను గుర్తించి ‘అక్షర కిరీటి’ బిరుదులతో సత్కరించారు. వారికి మెమెంటో, శాలువా, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా అక్షర కిరీటి బిరుదులు అందుకున్న ఈడే వెంకట భరత్ కుమారి, విశ్వనాథుని శంకరాచారికి గంపలగూడెం మండలం పెనుగొలను షిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. సాహిత్య రంగంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి గత ఏడాది కూడా షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పెనుగొలను గ్రామంలో ఘనంగా సన్మానించినట్లు కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా రచయితలు, కవులు సాహిత్య రంగంలో మరింతగా సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.