వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు
కదిరిలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు 10 ముస్లిం మైనార్టీ కుటుంబాల చేరిక
కదిరి: కదిరి పట్టణం 26వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన 10 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు తెలిపారు.
కదిరి నియోజకవర్గ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.