BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 20 September 2026, 06:03 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

సీనియర్ జర్నలిస్ట్ కొండపల్లి సురేష్ మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Sep, 2026 - 06:03 PM
4 వీక్షణలు

జర్నలిస్టు సంఘాల సంతాపం

అన్నమయ్య జిల్లా, రామసముద్రం: రామసముద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండపల్లి సురేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కొండపల్లి సురేష్ తన పాత్రికేయ ప్రస్థానాన్ని ఈనాడు దినపత్రికతో ప్రారంభించారు. రామసముద్రం మండల కేంద్రంలో విలేకరిగా పనిచేసిన ఆయన అనంతరం మదనపల్లె ఈనాడు ఎడిషన్‌లో కార్టూనిస్ట్‌గా కూడా చాలా కాలం సేవలందించారు.

తదుపరి ఆంధ్రజ్యోతి దినపత్రికలో పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు కేంద్రాల్లో జర్నలిస్టుగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో కొనసాగుతూ వివిధ ప్రాంతాల్లో వార్తా సేకరణ, ప్రజా సమస్యలపై కథనాల ప్రచురణలో భాగస్వామ్యమయ్యారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన సురేష్‌ను చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.

సురేష్ మృతి పట్ల పలు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురేష్ మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.