అమీర్పేటలో దారుణం.. అర తులం బంగారం కోసం వృద్ధురాలి హత్య
అమీర్పేటలో దారుణం.. అర తులం బంగారం కోసం వృద్ధురాలి హత్య
చెవికమ్మలు, నగదు కోసం కమలమ్మను చంపిన చిప్స్ షాప్ నిర్వాహకుడు
హైదరాబాద్ మీర్పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర తులం బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్న కమలమ్మను చిప్స్ షాప్ నిర్వాహకుడు ప్రకాష్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అటుగా వెళ్తున్న కమలమ్మను తన షాప్లోకి పిలిచిన ప్రకాష్.. ఆమె చెవులకు ఉన్న అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల నగదును తీసుకున్న అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి నీటి సంపులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రకాష్ను అరెస్ట్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.