www.ntodaynews.com
హైదరాబాద్లో శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్లో శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో శేషమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శేషమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.