www.ntodaynews.com
అమర-వన్ ప్రాజెక్ట్కు భూమిపూజ.. అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు జిల్లా చిన్నకాకాని జాతీయ రహదారి సమీపంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక అమర-వన్ ప్రాజెక్ట్ భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రగతికి మరింత ఊతమివ్వాలని ఆకాంక్షించారు.
రాజధాని ప్రాంత అభివృద్ధిలో అమర-వన్ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అమరావతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఈ ప్రాజెక్ట్ మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.