www.ntodaynews.com
అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి
తెలంగాణ
స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి.
దళిత గిరిజన ఆదివాసి జె.ఏ.సి నాయకుడు ముత్యాపాగ నరసింగరావు మాదిగ అంబేద్కర్ అభయ హస్తం పథకం తక్షణమే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని జేఏసీ నాయకులు ముఖ్యపాగ నరసింగరావు మాదిగ డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో 12 అంశాలతో కూడిన వాగ్దానాలను చేయడం జరిగినదన్నారు. అందులో ముఖ్యంగా SC,ST కుటుంబాలకు కుటుంబానికి 12 లక్షల రూపాయలు అందిస్తామని కాంట్రాక్ట్ పనులలో ఎస్సీ ఎస్టీ లకు రిజర్వేషనులు, పోడు భూముల కు పట్టాలు, ఎస్టీలకు 3, ఎస్సీలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా 12 అంశాలతో తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన ఆదివాసి ప్రజల అభివృద్ధికోసం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారన్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలోకి వచ్చి 18 నెలలు గడిచినప్పటికీ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ఈ స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికే ఈ నెల 26 న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం లో ఉన్న దళిత గిరిజన ఆదివాసి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, మేధావులు,ప్రజాస్వామిక వాదులు, ఉద్యమకారులందరు విజయవంతం చేశారన్నారు. జేఏసీ నాయకులు బొంకూరి. సురేందర్ సన్ని,పాలకుర్తి కృష్ణ నాయకులతో కలిసికట్టుగా పోరాటం చేసి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని సాధించుకుంటామని అన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube