అందం కోసం అర్రులు.. చివరికి రూ.60 వేలతో నవవధువు పరార్..!
అందం కోసం అర్రులు.. చివరికి రూ.60 వేలతో నవవధువు పరార్..!
సంగారెడ్డి: ఒంటరి జీవితానికి తోడు కోసం ఎదురుచూసిన ఓ మెకానిక్కు వివాహం పేరుతో భారీ మోసం జరిగింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే నవవధువు ఇంట్లో నుంచి పరారవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
స్థానికంగా మెకానిక్గా పనిచేస్తున్న ఆరిఫుద్దీన్ తొలి భార్యకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. యువతి కుటుంబ పరిస్థితి బాగోలేదని చెప్పడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.60 వేల నగదు కూడా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.
అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి నవవధువు కనిపించలేదు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా తీసుకుని పరారైనట్లు గుర్తించాడు. యువతి కుటుంబ సభ్యులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో, డబ్బుల కోసం పథకం ప్రకారమే వివాహం పేరుతో మోసం చేశారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. వివాహం పేరుతో మోసానికి పాల్పడిన ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.