BREAKING
చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
www.ntodaynews.com

అందం కోసం అర్రులు.. చివరికి రూ.60 వేలతో నవవధువు పరార్..!

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 07:12 PM
19 వీక్షణలు

అందం కోసం అర్రులు.. చివరికి రూ.60 వేలతో నవవధువు పరార్..!

సంగారెడ్డి: ఒంటరి జీవితానికి తోడు కోసం ఎదురుచూసిన ఓ మెకానిక్‌కు వివాహం పేరుతో భారీ మోసం జరిగింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే నవవధువు ఇంట్లో నుంచి పరారవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

స్థానికంగా మెకానిక్‌గా పనిచేస్తున్న ఆరిఫుద్దీన్ తొలి భార్యకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. యువతి కుటుంబ పరిస్థితి బాగోలేదని చెప్పడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.60 వేల నగదు కూడా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.

అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి నవవధువు కనిపించలేదు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కూడా తీసుకుని పరారైనట్లు గుర్తించాడు. యువతి కుటుంబ సభ్యులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో, డబ్బుల కోసం పథకం ప్రకారమే వివాహం పేరుతో మోసం చేశారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు వధువు కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. వివాహం పేరుతో మోసానికి పాల్పడిన ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.