ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణ బ్యూరో / N Today News: క్యూర్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. రెండో శనివారం, ఆదివారం, పండుగలు, ఇతర సెలవుల కారణంగా దరఖాస్తుల గడువును పొడిగించాలని వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. పథకంలో భాగంగా తొలుత 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తిచే శారు. మరో నాలుగు చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్ పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు tghb.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చని.. లేదా తెలంగాణ హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.