ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు చేసేవారికి షాక్
ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనానికి నో.. నెక్లెస్ రోడ్ వైపే ఏర్పాట్లు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో GHMC, పోలీసుల చర్యలు.. ట్యాంక్బండ్పై హెచ్చరిక బోర్డులు
హైదరాబాద్ | Ntoday News
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అంటే ట్యాంక్బండ్ గుర్తుకు వస్తుంది. అయితే ఈసారి ట్యాంక్బండ్పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ GHMC, హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ట్యాంక్బండ్ వైపు విగ్రహాలను తీసుకురాకుండా చెక్పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనాల కోసం నెక్లెస్ రోడ్ వైపు అదనపు ప్లాట్ఫారాలు, క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన బోర్డులను చూసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పలువురు గణేశ్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ట్యాంక్బండ్కు బదులుగా GHMC ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి సందర్భంగా హైదరాబాద్లో ప్రధాన నిమజ్జన కార్యక్రమం జరగనుంది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా అధికారులు ఇప్పటికే మార్గాలు, భద్రతా చర్యలను పరిశీలిస్తున్నారు.