అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గుర్తింపు
జాతీయం
అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గుర్తింపు
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ భీరవరసు శ్రీరామ్ శరణ్కు అంతర్జాతీయ స్థాయిలో విశేష గౌరవం లభించింది. ఆయన సేవలను గుర్తిస్తూ '1999 EX169' గ్రహశకలానికి ఆయన పేరును అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) అధికారికంగా నామకరణం చేసింది.
చంద్రయాన్-2 మిషన్తో పాటు శుక్రగ్రహ పరిశోధనల్లో ఆయన అందించిన విలువైన శాస్త్రీయ సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన సత్కారం దక్కింది. ఒక తెలుగు శాస్త్రవేత్తకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా దేశంలోని ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచింది.