BREAKING
బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్...
www.ntodaynews.com

అన్నారం ప్రభుత్వ బడిలో ఘనంగా బోనాల పండుగ..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
07 Aug, 2026 - 06:26 PM
81 వీక్షణలు
డొంకేశ్వర్, ఆగస్టు 07: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలను డొంకేశ్వర్ మండలంలోని అన్నారం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు మన ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు ఈ ముందస్తు బోనాల సంబరాలను అట్టహాసంగా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినులు సాంప్రదాయ లంగా ఓణీలు ధరించి పాఠశాలకు హాజరయ్యారు.పసుపు, కుంకుమ, వేప ఆకులతో అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన ఎత్తుకొని 
స్కూల్ ఆవరణ నుండి స్థానిక పోచమ్మ ఆలయం వరకు నిర్వహించిన విద్యార్థుల ఊరేగింపు గ్రామంలో పండుగ శోభను తీసుకువచ్చింది. డప్పు చప్పుళ్ల మోత, విద్యార్థుల పోతురాజు వేషధారణలు, శివసత్తుల పూనకాల మధ్య సాగిన ఈ ప్రదర్శన గ్రామ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలకు చిన్నతనం నుంచే మన పండుగల విశిష్టత తెలుస్తుందని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్‌వాడీ టీచర్లు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.