అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి.
కల్లెడలో అద్దె ఇంట్లో మృతదేహం.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
పర్వతగిరి | Ntoday News
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఓ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పర్వతగిరి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న భీమా నాయక్ కల్లెడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
శుక్రవారం ఉదయం భీమా నాయక్ ఇంట్లోనే మృతి చెంది కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది.
భీమా నాయక్ మృతికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మృతికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.