BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అత్యాచార బాధిత చిన్నారికి వైద్యం నిరాకరణ.. వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 07:32 AM
54 వీక్షణలు

అత్యాచార బాధిత చిన్నారికి వైద్యం నిరాకరణ.. వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ఘాజియాబాద్‌లో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి అత్యవసర వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేసిన ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, "మీరు మీ విధి నిర్వర్తించకపోతే పేరుకు ముందు 'డాక్టర్' అని రాసుకునే హక్కే లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోయినా బాధిత చిన్నారిని వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వైద్యులదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. పేద కుటుంబానికి చెందిన చిన్నారికి ఫీజులు చెల్లించలేరనే కారణంతో నిర్లక్ష్యం చేశారా అని వైద్యులను ప్రశ్నించింది.

బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని సంబంధిత ఆస్పత్రులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.