అవార్డు అందుకున్న మూడు రోజులకే లంచం కేసులో ఏసీబీ వలలో ఉద్యోగి
ఒంగోలు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్పై అవినీతి ఆరోపణలు
ఒంగోలు: ఆగస్టు 15 సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొంది అవార్డు అందుకున్న ఓ ఉద్యోగి, ఆ తర్వాత లంచం ఆరోపణలతో ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.
ఒంగోలు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నరేంద్ర ఓ ఇంటికి పన్ను విధించే విషయంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.
ఇటీవలే మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న నరేంద్రపై లంచం ఆరోపణలు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ సేవల్లో నిజాయితీ, నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చి అవార్డుల ఎంపిక జరగాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఏసీబీ కేసులో పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.