బైక్ ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా నిలిచిన సొసైటీ.. రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం సొసైటీలో అప్పు తీసుకున్న జగ్గవరపు సుధాకరరెడ్డి ఇటీవల జరిగిన ఘోర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సుధాకరరెడ్డి ఆకస్మిక మరణంతో భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
అయితే సంఘం ద్వారా ముందుగానే ఇన్సూరెన్స్ చెల్లించి ఉండటంతో, ఇన్సూరెన్స్ సంస్థ నుంచి రూ.2 లక్షల క్లెయిమ్ మంజూరైంది. దీంతో మృతుడి కుటుంబానికి కొంత ఊరట లభించింది.
ఈ సందర్భంగా సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ రావు చేతుల మీదగా మృతుడి భార్య సుజాతకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులు, సభ్యులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. కష్టకాలంలో ఇలాంటి భద్రతా పథకాలు కుటుంబాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.