www.ntodaynews.com
బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం
తెలంగాణ
/
మంచిర్యాల
బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ నివాసంలో భోజనం చేశారు.
అంతకుముందు లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్న కేటీఆర్, మే 6న పంటలను కాపాడుకునే క్రమంలో గోడ కూలి మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందించి వారికి సంఘీభావం తెలిపారు.
అనంతరం రంగపేటలోని బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంటికి వెళ్లిన కేటీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.