మధిరలో ఘనంగా వాసవి మాతకు గాజుల అలంకరణ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు..
మధిరలో ఘనంగా వాసవి మాతకు గాజుల అలంకరణ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
మధిర, సెప్టెంబరు 5: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వాసవి మాతకు గాజుల అలంకరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు శేషాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా లలిత పారాయణ కమిటీ, మధిర ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గాజులతో సుందరంగా అలంకరించిన వాసవి మాతను దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామ పారాయణంతో ఆలయ ప్రాంగణం భక్తి భావంతో మార్మోగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.