బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి
మంచిర్యాల,: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధిష్టానం ఇన్చార్జిలను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన ఈ నియామకాల జాబితా ప్రకారం.. మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా కౌశిక్ హరి, చెన్నూర్ నియోజకవర్గానికి తిప్పని లింగన్న, బెల్లంపల్లి నియోజకవర్గానికి మిరియాల రాజిరెడ్డిలను నియమించారు. పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ చర్యల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ఇన్చార్జిలు పర్యవేక్షించనున్నారు. ఈ నూతన నియామకాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి