ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ASI అశ్వద్ నారాయణ విచ్చేసారు. జగదీష్ రాజు మాట్లాడుతూ ప్రముఖ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు అయినటువంటి పూలే కులవ్యవస్థ, ఆడపిల్లల విద్య మరియు అంటరానితనం మీద అలుపెరగని పోరాటం చేసిన వీరున్ని మనం ఎన్నడూ మరువకూడదు అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికా రాణి, అరవ పల్లి వెంకటరెడ్డి, TVS ప్రసాద్, ఉమా శంకర్ వెంకటేష్, శివయ్య, శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ ఈశ్వరమ్మ, విజయ భాస్కర్ రెడ్డి, ఆది నారాయణ, నాగరాజ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.