BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పర్వతాపురం అటవీ ప్రాంతంలో విత్తన బంతుల వెదజల్లింపు కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 10:48 PM
113 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు అటవీశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "విత్తన బంతులను వెదజల్లు" కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహిస్తున్నారు. "మొక్కలు నాటుదాం – భవిష్యత్తు కాపాడుకుందాం, హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమవుదాం" అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్వతాపురం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో, డీఆర్వో హనుమంతుడు పర్యవేక్షణలో బీట్ ఆఫీసర్ నూర్జహాన్, అడవి సంరక్షణ కమిటీ చైర్మన్ మిద్దె సత్యనారాయణతో కలిసి పలు రకాల విత్తన బంతులను అడవిలో వెదజల్లారు.

ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ, వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని విత్తన బంతులను వెదజల్లడం ద్వారా అడవుల విస్తీర్ణం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.