www.ntodaynews.com
అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
చౌటుప్పల్
అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పోలీసులు పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్నారు . టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేస్తుండగా అశోక్ లిలాండ్ (TS 29 TA 4895) వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 5 ఆవులు, 5 ఎద్దులు లభ్యమయ్యాయి. డ్రైవర్ను విచారించగా అతని పేరు ఎస్కే కరీముల్లా బాబా (22), స్వస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం అని తెలిపాడు. కోదాడ సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.ఈ మేరకు పశువులను, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు.