www.ntodaynews.com
శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ మళ్లీ అరెస్ట్
తెలంగాణ
హైదరాబాద్, జూలై 10: శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా, తాజాగా ఆస్తుల వ్యవహారంలో కొత్త ఆధారాలు లభించడంతో ఈ చర్య చేపట్టారు.
ఏసీబీ అధికారులు వంశీ మోహన్కు సంబంధించిన బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఆయన ఫ్లాట్ నుంచి రూ.56 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో రెండు ఫ్లాట్లను బలవంతంగా తన పేరుపై రాయించుకున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.