BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

పుంగనూరులో జూలై 12న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Jul, 2026 - 07:40 PM
56 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | పుంగనూరు

పుంగనూరు పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ జాగరణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి, హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా హిందూ జాగరణ సమితి గౌరవ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ పరిరక్షణ, స్వరాజ్య స్థాపనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువతతో పాటు సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

జూలై 12 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు పట్టణంలోని ఎన్‌.ఎస్‌.పేట నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగనుందని తెలిపారు.

హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై శోభాయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.