BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

పుంగనూరులో జూలై 12న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Jul, 2026 - 07:40 PM
9 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | పుంగనూరు

పుంగనూరు పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ జాగరణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి, హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా హిందూ జాగరణ సమితి గౌరవ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ పరిరక్షణ, స్వరాజ్య స్థాపనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువతతో పాటు సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

జూలై 12 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు పట్టణంలోని ఎన్‌.ఎస్‌.పేట నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగనుందని తెలిపారు.

హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై శోభాయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.