పుంగనూరులో జూలై 12న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర
అన్నమయ్య జిల్లా | పుంగనూరు
పుంగనూరు పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ జాగరణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి, హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా హిందూ జాగరణ సమితి గౌరవ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తి, ధర్మ పరిరక్షణ, స్వరాజ్య స్థాపనకు ప్రతీక అని పేర్కొన్నారు. యువతతో పాటు సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
జూలై 12 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు పట్టణంలోని ఎన్.ఎస్.పేట నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైభవంగా కొనసాగనుందని తెలిపారు.
హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై శోభాయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.