BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి సమాజ సేవలో ముందుండాలి: జిల్లా అధ్యక్షుడు కుక్కడపు నాగేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 09:01 PM
104 వీక్షణలు

గంపలగూడెం, జూలై 10: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో శుక్రవారం వర్తక సంఘం భవన ఆవరణలో మండల ఆర్యవైశ్య సంఘం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్కడపు నాగేశ్వరావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాళ్ల చిన్న సత్యం బాబు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కుక్కడపు నాగేశ్వరావును శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కాజా రవికుమార్, జిల్లా కోశాధికారి కొత్తమాసు రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు వేములపల్లి రామకృష్ణారావు, యువజన సంఘం అధ్యక్షుడు అనుమోలు శివబాజీ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వనమా సుజాత, వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్ కంభంపాటి బద్రీనాథ్, వాసవి సేవాదళ్ చైర్మన్ నందిగాం గౌరీశంకర్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుగ్గల సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు మైలవరపు రామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యుడు కోట నాగేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు నాళ్ల లక్ష్మణరావు, గంపలగూడెం ఆర్యవైశ్య ప్రముఖుడు కొత్తగుండ్ల నరసింహారావుతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.