BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

యూఏపీఏ రద్దు చేయాలని విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jul, 2026 - 09:01 PM
58 వీక్షణలు

విజయవాడ, జూలై 10: విజయవాడ నగరంలో సీపీఐ ఆధ్వర్యంలో యూఏపీఏ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ, ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

యూఏపీఏ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా అమలవుతోందని విమర్శించారు. మతోన్మాద, ఫాసిస్ట్ శక్తుల బుల్డోజర్ పాలన ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగదని, గొప్ప పోరాట స్ఫూర్తి కలిగిన రాష్ట్ర ప్రజలు దానిని తిప్పికొడతారని హరినాథ్ అన్నారు.

అణిచివేతలకు పాల్పడిన పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ సమావేశానికి ఈశ్వరయ్య అధ్యక్షత వహించగా, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి. మధు, న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి టి. వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, జల్లి విల్సన్, అక్కినేని వనజ, ఎంసీపీఐ నాయకుడు ఖాదర్ బాషా, ఎస్‌యూసీఐ నేత అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.